Search

Sunday 27 January 2013

ప్రభాస్ 'మిర్చి' చిత్రం విడుదల ఫిబ్రవరి 8కి వాయిదా

prabhas'డార్లింగ్'‌, 'మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌' వంటి హిట్స్‌ ఇచ్చిన ప్రభాస్‌ హీరోగా గ్లామర్‌ క్వీన్‌ అనుష్క, రీచా గంగోపాధ్యాయలు హీరోయిన్లుగా కొరటాల శివను దర్శకునిగా పరిచయం చేస్తూ యు.వి. క్రియేషన్స్‌ పతాకంపై వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం 'మిర్చి'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్‌ కెరీర్‌లోనే అత్యధిక థియేటర్లలో ఫిబ్రవరి 8న విడుదలకు ముస్తాబవుతోంది. మ్యూజిక్‌ దేవీశ్రీప్రసాద్‌ అందించిన ఆడియో ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌ ఆడియోగా నిలిచింది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో సెన్సార్‌ కూడా పూర్తి చేసుకుని ఫిబ్రవరి 8వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేయటానికి సన్నాహాలు స్తున్నాం. ప్రభాస్‌ కెరీర్‌లో అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ప్రభాస్‌ ఓ వైవిధ్యమైన పాత్ర చేస్తున్నాడు. ఆయన లుకింగ్‌ స్టైల్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.

ఈ చిత్ర నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ప్రెస్టీజియస్‌గా ఈచిత్రాన్ని తెరకెక్కించాం. కొరటాల శివ కథ మీద కమాండ్‌తో హైస్టాండర్డ్స్‌లో టెక్నికల్‌ వాల్యూస్‌తో తెరకెక్కించారు. అన్ని వర్గాలవారిని అలరిస్తుంది' అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: మది, ఎగ్జిక్యూటివ్‌నిర్మాత: అశోక్‌కుమార్‌, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.

No comments:

Post a Comment

Popular Posts