Search

Tuesday 19 February 2013

నైజాంలో ‘మిర్చి’ ఘాటు, అమెరికాకు ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘మిర్చి' చిత్రం అమెరికాలో కలెక్షన్ల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రభాస్ అభిమానులకు శుభవార్త అందుతోంది. ఈ నెల 22, 23న ప్రభాష్‌తో కలిసి సినిమా చూసే అవకాశం మీరు దక్కించుకోవచ్చు.
సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రభాస్ అమెరికా వెలుతున్నాడు. ఈ నెల 22న లాస్ ఏంజిల్స్ లో, ఈ నెల 23న బే ఏరియాలో అభిమానులను కలవనున్నాడు. ప్రభాస్ ను కలిసి అతనితో పాటు సినిమా చూసేందుకు 916-496-1921, 908-787-2933 నెంబర్లు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవడం పాటు, టిక్కెట్లు దక్కించుకోండి.
prabhas is going usa
కాగా...నైజాం ఏరియాలో ‘మిర్చి' సినిమా కలెక్షన్లు అదిరిపోతున్నాయి. తొలి 11 రోజుల్లో మిర్చి చిత్రం నైజా ఏరియాలో 11.10 కోట్లు షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ టాక్. సినిమా బిజినెస్ పూర్తయ్యేలోగా ఈ చిత్రం నైజాం ఏరియాలో దాదాపు 16 కోట్ల వరకు వసూలు చేయవచ్చని అంచనా.
కొరటాల శివ ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ ప్రభాస్ సరసన హీరోయిన్లుగా చేయగా, యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, యూ. ప్రమోద్ సంయుక్తంగా ‘మిర్చి' చిత్రాన్ని నిర్మించారు. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, ‘సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.

No comments:

Post a Comment

Popular Posts