Search

Wednesday 20 February 2013

ఆయన దర్శకత్వంలో నటించటం లేదు : నయనతార ఖండన

Nayanthara Denies Doing Sundar C Project సెకండ్ ఇన్నింగ్స్ ని సూపర్ వేగంతో పరుగెట్టిస్తున్న నయనతార తాను వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, సందర్‌.సి దర్శకత్వంలో తాను నటించటం లేదని స్పష్టం చేసింది. తెరపై రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన నయనతార రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళుతోంది. తమిళంలో అజిత్‌కు జంటగా విష్ణువర్ధన్‌ చిత్రం, ఆర్య సరసన 'రాజారాణి', తెలుగులో నాగార్జునతో 'గ్రీకువీరుడు', గోపీచంద్‌తో మరో సినిమాతో తీరికలేకుండా ఉంది.
రీసెంట్ గా సుందర్‌.సి దర్శకత్వంలో నటించనుందన్న వార్తలు కోడంబాక్కంలో షికార్లు చేశాయి. ప్రస్తుతం విశాల్‌తో 'మదగజరాజా' రూపొందిస్తున్న సుందర్‌.సి. ఆపై సిద్ధార్థతో, అనంతరం 'అరణ్మనై' సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు, ఇందులో నయనతార ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే నయనతార మాత్రం ఈ విషయాన్ని ఖండించింది. 'కొత్త చిత్రానికి సంబంధించి సుందర్‌.సితోఎలాంటి చర్చలు జరపలేదు. ఆయన దర్శకత్వంలో నటించటం ఓ గౌరవం. ప్రస్తుతానికి చేతినిండా సినిమాలతో తీరికలేకుండా ఉన్నాను. సుందర్‌.సి దర్శకత్వంలో నటిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజంలేదని' తెలిపింది.
మరో ప్రక్క బాలీవుడ్ మూవీ ‘కహానీ'కి రీమేక్ గా రూపొందుతున్న చిత్రంలో నయనతార నటించబోతున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని ఖరారు చేస్తూ నయనతార ప్రకటన చేసింది. ఓప్రముఖ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ నయనతార ఈ విషయాన్ని ధృవీకరించింది.
‘బాలీవుడ్ మూవీ కహానీ చిత్రానికి రీమేక్ గా తెలుగు, తమిళంలో రూపొందబోయే చిత్రానికి నేను సంతకం చేసారు. ఈచిత్రంలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది' అంటూ నయనతార చెప్పిన విషయాన్ని చెన్నయ్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. నయనతార ఈ విషయాన్ని ఇలా అధికారికంగా ప్రకటించడంతో ‘కహానీ' చిత్రంపై ఉన్న ఊహాగానాలకు తెరపడ్డట్లయింది.

No comments:

Post a Comment

Popular Posts