Search

Friday 15 February 2013

బాలకృష్ణ సరసన సమీరా రెడ్డి ఎంపిక

Sameera Reddy Signs Balakrishna Film గ్గుపాటి రాణా కృష్ణం వందే జగద్గురం చిత్రంలో ఐటం సాంగ్ చేసిన సమీరా రెడ్డి తాజాగా మరో తెలుగు చిత్రం కమిటైంది. బాలకృష్ణ సరసన ఆమెకు హీరోయిన్ గా ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఆమె చాలా కాలం తర్వాత తెలుగులో హీరోయిన్ గా అవకాసం రావటంతో చాలా ఉత్సాహంగా ఉంది. అయితే బాలకృష్ణ చేస్తున్న ఏ చిత్రంలో ఆమె చేయనుందని మాత్రం తెలియరాలేదు. కానీ బాలకృష్ణ డైరక్ట్ చేసే చిత్రంలో చేసే అవకాసం ఉందని తెలుస్తోంది.
బాలకృష్ణ త్వరలో దర్శకుడుగా కనపించటానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రముఖ సిని రచయిత హరినాధరావు, వేణు ఈ చిత్రం స్క్రిప్టుపై పనిచేస్తున్నట్లు సమాచారం. దర్శకత్వంపై మక్కువ బాలయ్యకు ఇప్పుడు కొత్తగా పుట్టిందేంకాదు. గతంలోనే ఆయన ‘నర్తనశాల' చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో చేసే ప్రయత్నం చేశారు.
పైగా అర్జునుడు, బృహన్నల, కీచకుడు, కృష్ణుడు, సుయోధనుడు పాత్రలను అందులో బాలయ్య నటిస్తారని కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ ద్రౌపది పాత్రకు ఎంచుకున్న సౌందర్య ఆకస్మిక మృతితో ఆ సినిమా నిర్మాణం పక్కకు వెళ్లిపోయింది తర్వాత ‘శ్రీరామరాజ్యం' తర్వాత మళ్లీ బాలకృష్ణ ‘నర్తనశాల'ను ట్రాక్ పైకి తీసుకురానున్నారనీ, నయనతార ద్రౌపదిగా నటిస్తారనీ ఓ వార్త మీడియాలో షికారు చేసింది. అయితే అది నిజమో కాదో తేలో లోగా...... ఈ తాజావార్త వెలుగు చూసింది. ఓ జానపద చిత్రం ఈ సినిమా. అలాగే ఈ సినిమా ఈ నెలలోనే సెట్స్‌కి వెళ్లనుందని విశ్వసనీయ సమాచారం.
‘శ్రీమన్నారాయణ' చిత్రం తర్వాత బాలయ్య వేరే ఏ సినిమాకూ సైన్ చేయలేదు. హీరోగా కెరీర్ మొదలైన తర్వాత ఆయన ఇంత గ్యాప్ తీసుకోవడం ఇదే ప్రథమం. బాలయ్య విరామానికి కారణం ఏంటో అంతుపట్టని స్థితిలో ఆయన అభిమానులు ఉన్నారు. అలాంటి సమయంలో వెలుగుచూసిన ఈ వార్త అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే... త్వరలోనే బాలకృష్ణలోని దర్శక కోణాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారన్నమాట.

No comments:

Post a Comment